పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసిన భర్తను ఆస్పత్రికి తీసుకెళ్తూ ఆటో నుంచి జారిపడి భార్య మరణించిన విషాద ఘటన నక్కపల్లిలో జరిగింది. వెంకట్ నగర్ కాలనీకి చెందిన కర్రి నానాజీ(38), గౌరీ పార్వతి భార్యాభర్తలు. వారికి ఇద్దరు సంతానం. నానాజీ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం నానాజీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంట్లో పురుగుల మందు తాగి పడిపోయాడు. నోటి వెంట నురగలు వస్తూ పడిపోయిన భర్తని చూసి భార్య పార్వతి షాక్కి గురైంది. ఎలాగైనా భర్తని బతికించుకోవాలని ఆటో పిలిపించి భర్తని తీసుకుని ఆస్పత్రికి బయల్దేరింది. ఆస్పత్రి జంక్షన్ వద్ద పార్వతి ఆటో నుంచి ప్రమాదవశాత్తూ జారి కిందపడిపోయింది. తల రోడ్డుకి తగలడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించింది. భర్తని బతికించుకునే ఆరాటంలో తన ప్రాణాలు పోగొట్టుకుంది. భర్తను కాపాడుకోబోయి భార్య ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికులను కలచివేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
previous post
next post