*యాక్సిడెంట్లోఇద్దరు మహిళలు మృతి
మరో యువకుడి పరిస్థితి విషమం
*గచ్చిబౌలి ఐటీకారిడార్లో ప్రమాదం..
*హోలికి ముందు రోజే మద్యం కొన్న యువకులు..
*ఓ ప్రెండ్ రూమ్లో పార్టీ చేసుకున్న ఏడుగురు..
* మద్యం నింపిన కొంబరి బొండాలతో డ్రైవింగ్
మద్యం మత్తు.. ర్యాష్ డ్రైవింగ్ తో అమాకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ముగ్గురి ప్రాణాలు తీసింది. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్లు చేపట్టినా…కేసులు పడుతున్నా..అధిక మొత్తంలో చలానాలు వేస్తున్నా.. తాగుబోతులు మాత్రం మారడం లేదు.. నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. మితిమీరిన వేగంతో కారు డివైడర్ను ఢీకొట్టి మహిళ ప్రాణాలు తీశారు.
మద్యం మత్తులో..
గచ్చిబౌలి కారు ప్రమాద ఘటనకు మద్యం మత్తే కారణమని తేల్చారు పోలీసులు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో హోలీ వేడుకల్లో రోహిత్, గాయత్రి పాల్గొన్న అనంతరం విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి ఫుట్పాత్ను ఢీ కొట్టి గాల్లోకి ఎగిరిపడింది.
ఈ ఘటనలో ఆ దగ్గర్లోనే గార్డెనింగ్ పనులు చేస్తున్న మహేశ్వరి(38)తో పాటు .. గాయత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కారులో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న రోహిత్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు.
ప్రస్తుతం రోహిత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఫుట్పాత్ను కారు ఢీ కొట్టడంతో రెండు చక్రాలు ఊడిపడ్డాయి. కారు పల్టీ కొట్టగానే అందులోంచి గాయత్రి బయట పడిపోయినట్లుగా సీసీ పుటేజీలో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి ముందు.. రోహిత్, అతని స్నేహితులు ఫుల్లుగా మద్యం తాగి జల్సా చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. హోలి వేళ మద్యం అమ్మకాలు నిలిపివేయటంతో… స్నేహితులతో కలిసి రోహిత్ మద్యాన్ని ముందే కొనుగోలు చేశాడు. వాటిని అనుమానం రాకుండా.. 8 కొబ్బరి బొండాలలో కలపాడు. గాయత్రి, మరో ఐదుగురు రోహిత్ స్నేహితుడి గదిలో పార్టీ చేసుకున్నారు.
పార్టీ అనంతరం అందరూ కలిసి మద్యం కలిపిన కొబ్బరి బొండాలను తీసుకుని.. కారులో పెట్టుకొని ప్రిజమ్ పబ్కు వెళ్లారు. స్నేహితులు అంతా కలిసి సందడిగా గడిపారు. ఆ తర్వాత వేడుకల నుంచి కారు వద్దకు వచ్చి కొబ్బరి బొండాల్లో ఉన్న మద్యం సేవించారు. 8 కొబ్బరిబొండాల్లో ఆరింటిని తాగారు.
.