telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నూజివీడులో పొలిటిక‌ల్ హై అలెర్ట్‌..

*నియోజ‌వ‌ర్గం అభివృద్ధి చ‌ర్చ‌కు టీడీపీ స‌వాల్‌..
*ఎక్క‌డైనా చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌న్న వైకాపా నేత‌లు..
*గాంధీ బొమ్మ సెంట‌ర్ ద‌గ్గ‌ర‌ చ‌ర్చ‌కు ఫ్లేస్ ఫిక్స్‌..
*ఈవెళ సాయంత్రం 4గంట‌ల‌కు టైమ్ ఫిక్స్‌

*ముంద‌స్తుగా నేత‌లు గృహ నిర్భంధం..

కృష్ణా జిల్లా నూజివీడులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రెడీ అంటూ వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, టీడీపీ ఇంచార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఒకరిపై ఒకరుసవాళ్లు ప్ర‌తి స‌వాల్ విసురుకోవడంతో ఉద్రిక్త‌త నెల‌కొంది.

 నూజివీడు గాంధీ బొమ్మ సెంటర్లో చ‌ర్చ‌కు ప్లేస్ ఫిక్స్ చేయ‌డంతో పోలీసులు భారీగా మోహరించారు.  ఇరు రాజకీయ పార్టీల నాయకుల సవాళ్ళతో శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా రాజకీయ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. భారీ పోలీస్ బలగాల మోహరింపుతో నూజివీడు రాజకీయం వేడెక్కింది. 

Related posts