ఏపీ సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ నుంచి నేరుగా రేణిగుంట ఎయిర్ పోర్టుకు రానున్న జగన్ రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లనున్నారు. పద్మావతి అతిథి గృహంలో బస అనంతరం సాయంత్రం 5:27 గంటలకు అన్నమయ్య భవన్ నుంచి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో బీజేపీ, టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో జగన్ పర్యటనను అడ్డుకుంటారనే ప్రచారంతో పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. టీటీడీ పరిపాలన భవనం ముందు ఈ రోజు నిరసనకు టీడీపీ పిలుపునిచ్చింది. ఇందుకోసం జిల్లా నుంచి టీడీపీ ముఖ్యనేతలు తిరుపతికి రావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హౌస్ అరెస్టుల పర్వం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
సాక్షి బరితెగించి రాతలు రాసింది: సోమిరెడ్డి