telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ ..ఏపీలో ఏడుగురు అరెస్టు

After 11 Parishat Elections Telangana

ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఏపీలో జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. ప్రధాన పార్టీలతో పాటు ఆయా పార్టీల అధినేతల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా, బెట్టింగ్ రాయుళ్లు ఫలానా పార్టీ గెలుస్తుందని బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మంగళగిరిలో బెట్టింగ్ లు నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో నిందితులను గుంటూరు అర్బన్ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి రూ.10.15 లక్షల, ఒక కారు, 7 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఇదిలా ఉండగా మంగళగిరిలో నారా లోకేశ్ గెలుస్తాడని రూ.300 కోట్ల మేరకు బెట్టింగ్ లు చేసినట్టు సమాచారం.

Related posts