telugu navyamedia
క్రైమ్ వార్తలు

అత్తమామలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన అల్లుడు..

భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. అడ్డువచ్చిన మామపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఈ ఘటనలో మంటలను ఆర్పేందుకు వెళ్లిన అత్తకు కూడా గాయాలయ్యాయి. తనపై వేధింపుల కేసు పెట్టారని ఓ వ్యక్తి తన అత్తమామలపై పెట్రోలుపోసి నిప్పంటించాడు. కేపీహెచ్‌బీలో శనివారం అర్ధరాత్రి ఈఘ‌ట‌న జ‌రిగింది

వివర్లాలోకి వెళితే..
కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన నిఖిత తల్లిదండ్రులతో కలిసి కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్‌-6లో నివాసం ఉంటూ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె 2016లో కరీంనగర్‌కు చెందిన సాయికృష్ణను ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లైన ఏడాదికే సాయికృష్ణ అదనపు కట్నం కోసం నిఖితను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో నిఖిత సాయికృష్ణపై 2019లో కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్నుంచి ఆమె పుట్టింట్లోనే ఉంటోంది.

Hyderabad KPHB Colony Son In Law Attack Uncle With Petrol - Sakshi

తన భార్యను దూరం చేయడంతోపాటు కేసు పెట్టించారని కక్షగట్టిన సాయికృష్ణ శనివారం రాత్రి అత్తగారింటికి వచ్చి వారితో గొడవకు దిగాడు. ఈనెల 9న రాత్రి 9 గంటల ప్రాంతంలో అత్తగారింటికి పెట్రోల్ బాటిల్ తో వచ్చాడు. ఇతని చేతిలోని బాటిల్ చూసి యాసిడ్‌ దాడికి వచ్చాడనుకొని అతని భార్య నిఖిత భయబ్రాంతులకు గురై గదిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న మామతో గొడవకు దిగాడు. సీసాలోని పెట్రోల్‌ను మామపై పోసి అగ్గిపుల్ల గీయడంతో ఆయనకు గాయాలయ్యాయి. నిఖిత తల్లి రమాదేవి అడ్డుకోగా ఆమెకూ గాయాలయ్యాయి. వెంటనే నిందితుడు పారిపోయాడు. క్షతగాత్రులను పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Related posts