telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం : స్పాట్ లో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన బస్సు ఒక్కసారిగా జనాలపైకి దూసుకెళ్లింది. బస్సు విధ్వంసం అంతటితో ఆగలేదు. రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొట్టడంతో బస్సు ఆగింది. అంతేకాక బస్సు బీభత్సానికి మూడు ద్విచక్ర వాహనాలు కూడా తుక్కుతుక్కయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో ఓ మహిళ ఉండటం గమనార్హం. ఈ ఘటన తిరుపతిలోని కర్ణాల వీధిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవరు అక్కడి నుంచి పరారు అయ్యాడు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి.. పరారు అయిన డ్రైవరు కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

Related posts