telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

శ్రీలంకలో పేలుళ్లలో హైదరాబాద్‌ వాసి మృతి

bomb blast srilanka

శ్రీలంకలోని ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 8 మంది భారతీయులు మృతి చెందినట్టు కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో హైదరాబాద్‌ వాసి మృతిచెందారు. మృతుడు అమీర్‌పేటకు చెందిన తులసీరాం(31)గా గుర్తించారు. తులసీరాం హైదరాబాద్‌లో పైలట్‌ శిక్షణ తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు తులసీరాం అమ్మమ్మ స్వస్థలం. ఇప్పటికే తులసీరాం తల్లి నళిని హైదరాబాద్‌కు చేరుకున్నారు. వ‌రుస బాంబు పేలుళ్ల దాడిలో మృతుల సంఖ్య 321కి పెరిగింది. మొత్తం 500 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

Related posts