జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులకు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సోఫియాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. మెల్హురా ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు నిన్న రాత్రి సమాచారం అందింది.
ముందస్తు సమాచారం మేరకు ఆ ప్రాంతంలో ఆర్మీ 55 రాష్ట్రీయ రైఫిల్స్, సోఫియాన్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కలిసి ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు, బలగాల మధ్య చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కర్లు మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.