telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

నమోదు కాని కేసులు.. రెండు రెడ్‌జోన్ల ఎత్తివేత!

Corona

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైరస్ విస్తరణ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలోని రెండు ప్రాంతాల్లో అధికారులు రెడ్ జోన్ ను ఎత్తివేశారు. గత 28 రోజులుగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో నగరంలోని వీరభద్రాపురం, శాంతినగర్ లో రెడ్ జోన్ ఎత్తివేస్తూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పట్టణంలో ఎనిమిది కంటైన్మెంట్ జోన్లు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఏపీలో నిన్న ఒక్కరోజే 82 పాజిటివ్ కేసులు నమోదుకాగా… మొత్తం కేసుల సంఖ్య 1,259కి చేరింది. వైరస్ ను కట్టడి చేయడం కోసం ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు తీసుకుంటోంది. భారీ సంఖ్యలో పరీక్షలను నిర్వహిస్తున్నారు.

Related posts