telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ర‌ఘురామ‌ కేసులో సీబీఐకి నోటీసులు…

court

ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు భ‌ర‌త్ తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో హింసించారని సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అక్రమ అరెస్టు, కస్టడీలో పోలీసులు పెట్టిన హింసపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో దర్యాప్తు జరిపించాలని విజ్ఞ‌ప్తి చేశారు.. అయితే ఆ రిట్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్ర‌భుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.. దీనిపై 6 వారాల‌లోపు అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.. ఇక‌, త‌దుప‌రి విచార‌ణ‌ను ఆరు వారాల‌కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. కాగా, రఘురామరాజును కస్టడీలో వేధించారని.. అమానుషంగా, చట్టవిరుద్ధంగా తీవ్రంగా హింసించారని భరత్‌ ఆరోపించారు. అరెస్టు చేసిన తీరును కూడా ఆక్షేపించారు. అయితే చూడాలి మరి ఈ కేసులో ఇంకా ఏం జరగనుంది అనేది.

Related posts