లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలు పస్తులు ఉండకుండా.. అన్న క్యాంటీన్లు తెరిచి వారిని ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మేరకు కోవిడ్-19 వ్యాప్తి పై ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ రాశారు. కరోనా అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని ఆయన హితవుపలికారు. కరోనా నివారణను సవాల్గా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఏపీలో ల్యాబ్లు పెంచాలని, ఎక్కువ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. పాజిటివ్ కేసులను దాచిపెడుతున్నారన్న ప్రచారం ఉందని, స్థానిక వాస్తవాలను తొక్కిపెట్టడం మంచిదికాదని హితవుపలికారు. ఓ వైపు ప్రభుత్వం భౌతిక దూరం పాటించాలని చెబుతూనే.. రేషన్ పేరుతో జనాల్ని ఒకేచోటుకు చేర్చడం సరికాదన్నారు. ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం సరికాదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.