telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

కర్నూల్‌ ను వణికిస్తున్న కరోనా.. మరో ఇద్దరు డాక్టర్లకు పాజిటివ్‌!

deaths increased to 131 due to corona virus

ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఆ జిల్లాలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో కొత్తగా ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో కరోనా బారిన పడ్డ డాక్టర్ల సంఖ్య ఆరుకు చేరింది. కర్నూలు జిల్లాలో మొత్తం 261 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఎనిమిది మంది మరణించారు. ఒక్క కర్నూలు నగరంలోనే 104 మంది కరోనా బారిన పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటివరకు 955 కరోనా కేసులు నమోదవగా, 29 మంది మరణించారు. 781 మంది బాధితులు చికిత్స పొందుతుండగా, 145 మంది కొలుకుని ఆస్పత్రుల నుంచి ఇంటికి చేరుకొన్నారు.

Related posts