పలు దేశాల్లో మాజీ క్రికెటర్లను రాజకీయాల్లోకి ఆహ్వానించి పదవులు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ కు కూడా అరుదైన గౌరవం దక్కినట్టు సమాచారం. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారని తెలుస్తోంది.
నార్త్ ప్రావిన్స్ గవర్నర్ గా మురళీధరన్ ను బాధ్యతలు స్వీకరించాలని కోరినట్టు సమాచారం. రాజపక్స విజ్ఞప్తి మేరకు గవర్నర్ బాధ్యతలను మురళీధరన్ స్వీకరిస్తాడని తెలుస్తోంది. ఈస్ట్ ప్రావిన్స్ కు అనురాధ యహంపతి, నార్త్ సెంట్రల్ ప్రావిన్స్ కు తిస్సా వితర్ణ లు గవర్నర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు అధికారవర్గాల సమాచారం.
తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి: ఎర్రబెల్లి