telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ కు జోడిగా శృతి హాసన్… ఫైనల్ చేసిన త్రివిక్రమ్

ntr

ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోలో గతంలో వచ్చిన ‘అరవింద సమేత’ మూవీ అభిమానులను అలరించింది. ఇప్పుడు ఇదే కాంబో మరోసారి రిపీట్ కానుండటం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. హారిక అండ్ హాసిని బ్యానర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫస్ట్ హీరోయిన్‌గా పూజా హెగ్డే, కియారా అద్వానీ, జాన్వీ కపూర్ పేర్లను పరిశీలించిన త్రివిక్రమ్ ఫైనల్‌గా కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ వైపు మొగ్గు చూపారనేది లేటెస్ట్ టాక్. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా చేస్తున్నారని తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. అందుకు అనుగుణంగానే ఎన్టీఆర్ నుంచి, శృతి హాసన్ నుంచి డేట్స్ అడిగారని సమాచారం. అప్పట్లో ఎన్టీఆర్‌తో ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో రొమాన్స్ చేసింది శృతి హాసన్.

Related posts