మెదక్ జిల్లాలో మహాలక్ష్మి స్టీల్ప్లాంట్లో రాత్రి ప్రమాదం సంభవించింది. బాయిలర్ క్రేన్ తెగిపోయిన ప్రమాదంలో లారీ డ్రైవర్ సుమన్ (25), కార్మికుడు మహేశ్ ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
సమాచారం అద్నుకున్న పోలీసులు స్టీల్ప్లాంట్కు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు సుమన్ స్వస్థలం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం. మహేశ్ స్వస్థలం మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లా లోలస్ అజయ్ గఢ్ గ్రామం. వీరు గత కొంతకాలంగా ప్లాంట్లో పనిచేస్తున్నారు.