సీపీఆర్వో రాకేష్ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జనసాధారణ్ వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 07032 విజయవాడ- రేణిగుంట: ఈ రైలు ఈ నెల 30న విజయవాడలో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.15కు రేణిగుంటకు చేరుకుంటుంది.
07027 విజయవాడ- విజయనగరం: ఈ రైలు ఈ నెల 30న సాయంత్రం 4.30కు విజయవాడలో బయలుదేరి, రాత్రి 23.55 గంటలకు విజయనగరానికి చేరుకుంటుంది. ఈ రైళ్లకు అన్ని జనరల్ బోగీలే ఉంటాయి.