telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ప్రయాణికులతో సహా బస్సును ఎత్తుకెళ్లిన దొంగ దొరికాడు… తాగిన మైకంలో…!?

Bus

ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన బస్సును ప్రయాణికులతో సహా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. బస్సును ఎత్తుకెళ్లింది ఆర్టీసీలో పనిచేసే క్యాజువల్ ఉద్యోగిగా తేల్చారు. బస్సుల వాషింగ్ సెంటర్లో పని చేస్తున్న ఆంజనేయులు అనే వ్యక్తి బస్సును ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. తాగిన మైకంలో అతడు బస్సును ఎత్తుకెళ్లాడని.. విడి భాగాలు అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని భావించాడని పోలీసులు తెలిపారు. తాగుడు బానిసైన ఆంజనేయులు.. జల్సాలకు అలవాటు పడ్డాడని తెలుస్తోంది. వచ్చే జీతం చాలకపోవడంతో.. బస్సు ఎత్తుకెళ్లాలని స్కెచ్ వేశాడని తెలిపారు. ఆంజనేయులు రెండు రోజుల క్రితం తాండూరు కరన్‌కోట్ మీదుగా ఓగీపూర్ వెళ్లేందుకు పాయింట్‌పై ఉన్న నైట్ హాల్ట్ బస్సును తాగిన మైకంలో తస్కరించాడని తాండూరు సీఐ ఎస్.రవికుమార్, ఎస్సై ఏడుకొండలు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మరో విషయం ఏంటంటే.. ఇంటికెళ్లడానికి వాహనాలేవీ కనిపించకపోవడంతో.. ఆంజనేయులు బస్సును ఎత్తుకెళ్లాడట. ఇంటి సమీపంలోకి చేరుకోగానే బస్సును రోడ్డు మీదే వదిలేసి పరారయ్యాడని ప్రచారం జరిగింది.

Related posts