telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు ప్రజలకు హైదరాబాద్ తర్వాత విశాఖే పెద్ద నగరం: టి.సుబ్బరామిరెడ్డి

subbiramireddy tekkirala

తెలుగు ప్రజలకు హైదరాబాద్ తర్వాత విశాఖే పెద్ద నగరమని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జీఎన్‌ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించిన విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నానని చెప్పారు.

ఏపీకి విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావడం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అమరావతిలో రాజధాని కోసం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని సుబ్బరామిరెడ్డి కోరారు. తాను తన వ్యక్తిగత అభిప్రాయాలను చెబుతున్నాని స్పష్టం చేశారు.రాష్ట్రం మధ్యలోనే రాజధాని ఉండాలనే నిబంధన లేదని సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ కూడా ఓ పక్కకు ఉన్నాయని తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌కు కావాల్సిన అన్ని వసతులు విశాఖకు ఉన్నాయని, విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Related posts