ఏపీ ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించేందుకు మరో మరో పథకాన్ని ప్రారంభించనుంది. వచ్చే నెల 10వ తేదీ నుంచి ‘వైయస్సార్ కంటివెలుగు’ పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద అందరికీ ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించనున్నారు. అవసరమైనవారికి కళ్లజోళ్లను ఉచితంగా అందించనున్నారు.
తెలంగాణలో కూడా కేసీఆర్ ప్రభుత్వం కంటివెలుగు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది కంటి పరీక్షలు చేయించుకొని, ఉచితంగా కళ్ళజోళ్లను పొందుతున్నారు.