లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లంగర్హౌస్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. బైక్ పై అకారణంగా బయటికి రావడంతో వాహనాదారుడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ వ్యక్తి పోలీసులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. తాను ఓ పోలీసు అధికారి కొడుకునంటూ పోలీసులపైనే తిరగబడ్డాడు. మీ అంతు చూస్తానంటూ పోలీసులపై బూతుల వర్షం కురిపించాడు.
అక్కడున్న ఒకరిద్దరు పోలీసులు వాహనదారుడితో ఎంతో సహనంగా మాట్లాడినప్పటికీ ఇంకాస్త రెచ్చిపోయి ప్రవర్తించాడు. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న స్టేషన్కు తరలించారు.సదరు వ్యక్తి కొద్దిరోజుల క్రితమే మద్యం దొరక్క ఎర్రగడ్డలోని డీఅడిక్షన్ సెంటర్లో చికిత్స తీసుకొని ఇటీవలే డిశ్చార్జ్ అయ్యాడని తెలిసింది.
జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినెట్ లో చర్చ జరగాలి: పురంధేశ్వరి