అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తెలంగాణలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం చేసినందుకు సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ఏపీ భవన్ ఉద్యోగుల నినాదాలు చేశారు. ఏపీ ఉద్యోగులను తెలంగాణ భవన్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతికి ఒక్క రోజు ముందు రాజ్యాంగ నిర్మాతకు ఘోర అవమానం జరిగింది.
హైదరాబాద్ పంజాగుట్టలో శుక్రవారం అర్ధరాత్రి ఎస్సీ సంఘాలు ఏర్పాటు చేసిన విగ్రహం శనివారం సాయంత్రానికి ధ్వంసమై డంపింగ్ యార్డులో కనిపించింది. విగ్రహం ముక్కలైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ప్రజాస్వామిక వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారు: దేవినేని ఉమ