telugu navyamedia
వార్తలు సామాజిక

దేశంలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 78,761 మందికి పాజిటివ్

corona covid

దేశంలో కరోనా విజృంభించదాంతో రోజురోజుకూ కొవిడ్-19 కేసులు పెరిగిపోతున్నాయి. కొన్నిరోజులుగా 75 వేలకు మించి కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 78,761 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదే సమయంలో 948 మంది మృతి చెందారని వెల్లడించింది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 35,42,734 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 63,498 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 27,13,934 మంది కోలుకున్నారు. 7,65,302 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్నటి వరకు మొత్తం 4,14,61,636 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

Related posts