ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. భారీగా పెరిగిపోతోన్న కరోనా కేసులను ప్రస్తావిస్తూ సీఎం జగన్పై మండిపడ్డారు. . ప్రతిరోజు 10 వేల పైనే కేసుల నమోదవుతున్నాయని గుర్తు చేశారు.
రాష్ట్రంలో పాజిటివ్ రేటు 17% పైగా పెరిగిందన్నారు. దేశంలో రోజువారీ కేసులు, మొత్తం కేసుల నమోదులో జాతీయ సగటులో ఏపీ ముందంజలో ఉందన్నారు.పటిష్ఠ ప్రణాళికలతో అనేక రాష్ట్రాలు కరోనాను జయిస్తున్నాయి. రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని వైఎస్ జగన్ ను ప్రశ్నించారు. రాష్ట్రంలో 24 గంటల్లో 62,024 మందికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా 10,548 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.