ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. రాయలసీమ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం హింసాత్మకం కావడం పట్ల స్పందించారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో బీజేపీ, జనసేన కార్యకర్తలపై వైసీపీ గూండాలు దాడి చేశారంటూ సుజనా మండిపడ్డారు.
వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంత అరాచకం గతంలో ఎప్పుడూ చూడలేదని ట్వీట్ చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు విపక్షాల నామినేషన్లను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఏపీలో రోడ్ల దుస్థితిపై సోమిరెడ్డి కామెంట్స్