telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో విద్యుత్ కోతలు.. ప్రభుత్వంపై పవన్ చురకలు!

pawan-kalyan

ఏపీలో విద్యుత్ కోతలు విధిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో వ్యంగస్త్రాలు సంధించారు. బొగ్గు నిల్వలు అడుగంటిపోయాయని, థర్మల్ విద్యుత్ ఉత్పాదన తగ్గడంతో కరెంటు కోతలు తప్పడంలేదని ఏపీ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు.

“క్షమించాలి, మా పనయిపోయింది” అంటూ ఏపీ సర్కారు ప్రజలకు ఈ విధంగా చెబుతోందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, జాతీయ మీడియాలో వచ్చిన ఓ వార్త క్లిప్పింగ్ ను కూడా ట్వీట్ చేశారు. ‘క్షీణించిపోతున్న బొగ్గు నిల్వలు.. తెలంగాణ సీఎంను సాయం కోరిన జగన్’ అంటూ ప్రచురితమైన కథనాన్ని కూడా పవన్ ఈ సందర్భంగా జోడించారు.

Related posts