telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ!

tirumala temple

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గిపోయింది. ఈ ఉదయం స్వామి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు వేచి చూస్తున్నారు. వీరికి రెండు గంటల్లోనే దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న తిరుమల స్థానికులు స్వామి దర్శనం కోసం వెళుతున్నారు.

దివ్య దర్శనం, రూ. 300 టికెట్ల ప్రత్యేక దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన వారికి కూడా రెండు గంటల్లోనే దర్శనం పూర్తవుతోంది. నేటి అర్థరాత్రి 12 గంటలకు దర్శనాన్ని ఆపేస్తామని, ఆపై 2 గంటల నుంచి వైకుంఠ ద్వారాలను తెరుస్తామని అధికారులు తెలిపారు. తొలుత వీఐపీ దర్శనాల అనంతరం సామాన్య భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు.

Related posts