telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

రైలులో తరలిస్తున్న రూ. 43 కోట్ల బంగారం పట్టివేత

gold-biscuits hyd

విదేశాల నుంచి అక్రమంగా దేశంలోకి తరలించిన బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా రైలులో అక్రమంగా తరలిస్తున్న ముఠానుఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 43 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం మయన్మార్ నుంచి తీసుకుని వచ్చారని భావిస్తున్న 504 బంగారం బిస్కెట్లను నిందితులు రైలులో ఢిల్లీకి తీసుకుని వచ్చారు.

మొత్తం 504 బంగారం బిస్కెట్లను వీరుతెచ్చారు. ఇవన్నీ 99.9 శాతం స్వచ్ఛతను కలిగివున్నవే కావడం గమనార్హం. వీటి విలువ దాదాపు రూ. 43 కోట్లని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామని, ధర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Related posts