“అభివృద్ధి” అంటే రాజధానిని విభజించడం కాదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దని మందడంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గల్లా మాట్లాడుతూ, రాజధాని అంశంపై పార్లమెంట్ లో గట్టిగా పోరాడతామని అన్నారు.
పెయిడ్ ఆర్టిస్టులంటూ రైతులు, మహిళలను కించపరిచే వారు సిగ్గుపడాలన్నారు. అమరావతిని మూడు ముక్కలు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయని విమర్శించారు. అలా విభజించుకుంటూ పోతే ఖర్చు పెరుగుతుంది తప్ప ఆదాయం రాదన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారని గల్లా జయదేవ్ కు మహిళలు ఫిర్యాదు చేశారు.
రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు: వీహెచ్