telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైసీపీ ప్రొడక్షన్స్ సమర్పించు అత్యద్భుతమైన సినిమా..”జనం చెవిలో జగన్ పూలు”..

ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలు, రాజధాని అమరావతి, వారం రోజుల్లో సీపీఎస్ రద్దు హామీలు విస్మరించిన తీరును .. ప్రస్తుతం చేస్తున్న పనులను ఎండగడుతూ. టీడీపీ నేత నారా లోకేష్ సెటైరికల్ వీడియోను ట్వీట్ చేశారు.

2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలు, ప్రస్తుతం చేస్తున్న పనులను ఉదహరిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ సెటైరికల్ వీడియోను ట్వీట్ చేశారు. వైసీపీ ప్రొడక్షన్స్ సమర్పించు అత్యద్భుతమైన సినిమా ‘జనం చెవిలో జగన్ పూలు’ ఏప్రిల్ 1న విడుదల అని లోకేష్ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.

ఆ వీడియోలో జగన్ స్వయంగా ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారో, ఏ విధంగా ప్రజలను ఇప్పుడు ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారో జగన్ మాటల్లోనే చూపించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీల పెంపు అన్నదే ఉండదని స్పష్టమైన హామీ ఇచ్చారు.. కానీ ఇప్పుడు ఆ హామీని సీఎం జగన్ తుంగలోకి తొక్కారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు, మద్యనిషేధం, ప్రత్యేక హోదా, సన్నబియ్యం పంపిణీపై ఇచ్చిన హామీలను ఇప్పుడు తుంగలో తొక్కారని.. ప్రజలను జగన్ ఏప్రిల్ పూల్ చేశారని నారా లోకేష్ విమర్శించారు.

ఇప్పటికే విద్యుత్ ఛార్జీలను పెంచి అడ్డగోలుగా ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోందని నారా లోకేష్ విమర్శించారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీల పేరుతో బాదుడే బాదుడు జరుగుతోందని.. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ అంధకారప్రదేశ్‌గా మారిపోయిందని నారా లోకేష్ విమర్శలు చేశారు.

Related posts