టీడీపీ మాజీ నేత సాదినేని యామిని శర్మ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో బీజేపీలో చేరారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న షెకావత్ ఓ కార్యక్రమంలో యామిని శర్మకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వ్యక్తిగతమైన కారణాలతో పాటు రాష్ట్రం, దేశంలోని రాజకీయ పరిస్థితుల కారణంగా పార్టీని వీడుతున్నట్లు ఆమె తెలిపారు.
గత ఏడాది నవంబర్ లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, పార్టీ ఫ్రాథమిక సభ్యత్వానికి యామిని శర్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు తనకు ఇచ్చిన సహకారం ఎనలేనిదని టీడీపీని వీడుతున్న సమయంలో ఆమె వెల్లడించారు.