ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 8న పోలింగ్ ఉంటుందని, 11వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల 14న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడంతో ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఒకే విడుతలో ఎన్నికలు జరగనున్నాయని ఆయన తెలిపారు. ఢిల్లీలో మొత్తం 1,46,92,136 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల కోసం 13,750 పోలింగ్ కేంద్రాలను, 90 వేల మంది సిబ్బందిని వినియోగించుకోనున్నారు.