ఆధునిక సమాజానికి మార్గనిర్దేశం చేసిన వాల్మీకి మహర్షికి మనందరం రుణపడి ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. నేడు వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. గొప్పదనం అనేది పుట్టుకలో ఉండేది కాదని, జీవితంలో మనం చేసిన పనులే మనల్ని గొప్ప వ్యక్తులుగా నిలబెడతాయన్న విషయాన్ని వాల్మీకి చరిత్ర చెబుతుందని అన్నారు. రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి చక్కగా విశదీకరించారని కొనియాడారు.
ఈ సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ కూడా స్పందించారు. ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నానని అన్నారు. ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపి, ప్రజారంజక పాలన చేసి మహనీయుడైన శ్రీరామచంద్రుని చరిత్రను రామాయణ మహాకావ్యంగా మలచి మనకు అందించిన మహానుభావుడు వాల్మీకి అని కొనియాడారు.
మోదీ విమర్శల పై స్పందించిన మాయావతి