కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడ్డారు.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను కూడా టచ్ చేసింది కరోనా.. తాజాగా..కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా కరోనా బారినపడ్డారు. రెండు రోజులుగా ఆరోగ్యం సహకరించకపోవడంతో కరోనా పరిక్షలు చేయించుకున్నారు. దీంతో పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపారు. “నేను,నా భద్రతా సిబ్బంది శ్రీనివాస్ COVID-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డము. మేము ఆరోగ్యంతో బాగానే ఉన్నాము. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాము, నాతొ ఈమధ్యలో కలసిన వారు అందరు దయచేసి విధిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాను,నా శ్రేయోభిలాషులందరు ఆందోళన చెందవద్దని కోరుచున్నాను” అంటూ పేర్కొన్నారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
previous post
next post