telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండోర్‌- వారణాశి మార్గంలో… మూడో ప్రైవేటు రైలు …

first private train booking open tomorrow

రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ ఇండోర్‌- వారణాశి మార్గంలో మూడో ప్రైవేటు రైలు నడపనున్నట్లు తెలిపారు. హంసఫర్‌ తరహాలో కోచ్‌లు ఉండనున్నాయని తెలిపారు. ఐఆర్‌సీటీసీ ఇప్పటికే దిల్లీ-లఖ్‌నవూ, అహ్మదాబాద్‌-ముంబయి మధ్య తేజస్‌ పేరిట రెండు రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇండోర్‌- వారణాశి రూట్‌లో మూడో రైలు నడపనున్నట్లు తెలిపారు. రాత్రి పూట నడిచే ఈ రైల్లో స్లీపర్‌ కోచ్‌లు ఉండనున్నాయి.

ఈ రైలు వారానికి మూడు రోజుల పాటు నడవనుంది. అందులో రెండు రోజులు వయా లఖ్‌నవూ రూట్‌లో, ఇంకో రోజు వయా అలహాబాద్‌ రూట్‌లో నడవనుంది. ఫిబ్రవరి 20 నుంచి ఈ ప్రైవేటు రైలు పట్టాలెక్కే అవకాశం ఉంది.

Related posts