telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఎయిర్ ఇండియాలో ఉద్యోగుల కుదింపు..!

Air India flight

ఉద్యోగుల సంఖ్యను తగ్గించే దిశగా ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. పనితీరు సరిగ్గా లేదని భావిస్తున్న ఉద్యోగులను నిర్బంధ సెలవుపై ఐదేళ్ల వరకూ పంపాలని భావిస్తోంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని సీఎండీ (చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్) రాజీవ్ భన్సాల్ కు అప్పగిస్తూ బోర్డు తీర్మానాన్ని ఆమోదించింది.

ఉద్యోగుల క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, హెల్త్ తదితరాలతో పాటు ఇటీవలి కాలంలో పెట్టిన సెలవులు తదితరాలను మదించి ఎవరిని సెలవులపై పంపించాలన్న విషయమై సిఫార్సులు చేస్తారని సంస్థ అధికారులు వెల్లడించారు. బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం తొలుత ఆరు నెలలపై ఉద్యోగులను సెలవుపై పంపించే అధికారం సీఎండీకి ఉంటుంది. ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయాల హెడ్స్, రీజనల్ డైరెక్టర్లు తమ పరిధిలోని ఉద్యోగుల పనితీరును మదించనున్నారు.

Related posts