ఐపీఎల్ 2021 ఈరోజు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్ మధ్య జరగనున్న మ్యాచ్ ఫలితాన్ని కూడా అంచనా వేశాడు టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా. రాజస్థాన్-పంజాబ్ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ చేస్తుందని ఆకాశ్ చోప్రా తెలిపాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో మొత్తం 12 సిక్స్లు నమోదవుతాయన్నాడు. ఇక ఇరు జట్లలో నాలుగో స్థానంలో వచ్చే బ్యాట్స్మన్ 30+ రన్స్ చేస్తారన్నాడు. అంతేకాకుండా కేఎల్ రాహుల్ నేతృత్వంలోని పంజాబ్.. సంజూశాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ను ఓడిస్తుందని మ్యాచ్ ఫలితాన్ని కూడా చెప్పేశాడు. అయితే నెటిజన్లు మాత్రం ఆకాశ్ చోప్రా చెప్పింది ఏది జరగదని కామెంట్ చేస్తున్నారు. అతను పంజాబ్ గెలుస్తుందని అంటున్నాడంటే.. ఈ రోజు మ్యాచ్లో రాస్థాన్ విజయం ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ సీజన్లో జరిగిన మూడు మ్యాచ్ల్లో ఆకాశ్ చోప్రా చెప్పిన ప్రిడిక్షన్స్ తప్పయ్యాయని కామెంట్ చేస్తున్నారు. ఆర్సీబీ X ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన విజయం సాధిస్తుందని ఆకాశ్ చోప్రా చెప్పగా.. ఆర్సీబీ విజయాన్నందుకుంది. ఢిల్లీ-చెన్నై మ్యాచ్లో ధోనీ సేనకు విజయం దక్కుతుందని చెప్పగా.. ఢిల్లీ గెలుపొందింది. ఇక ఆదివారం జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్- కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్లో హైదరాబాద్ విజయం సాధిస్తుందని అంచనా వేయగా.. కేకేఆర్ బోణీ కొట్టింది. ఈ మూడు ప్రిడిక్షన్ తప్పిదం కావడంతో తాజా అంచనా కూడా తలకిందులవుతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
previous post