telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ ఫోటో మార్ఫింగ్..అభిమానులు ఫైర్

pawan-kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోటో మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై జనసైనికులు మండిపడుతున్నారు. పవన్ చేతిపై ఏపీ సీఎం టాటూను వేయించుకున్నారంటూ ఓ మార్ఫింగ్ ఫొటోను కొందరు వదిలారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు దీనిపైఇటీవల కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఓ ఫొటోను కొందరు మార్ఫింగ్ చేశారు. ఎలాంటి టాటూ లేని పవన్ చేతిపై జగన్ ఫొటోను ఉంచారు. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు, జనసేన ట్విట్టర్ అకౌంట్ కు కూడా ట్యాగ్ చేసారు. ఈ మార్ఫింగ్ ఫోటోపై జనసేన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts