telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘కార్తికేయ -2’ టీం కు కష్టాలు… మంచు తుఫాన్ లో

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో టి.జి. విశ్వప్రసాద్,  అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ‘కార్తికేయ -2’ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్ ఒకటి 20 రోజుల పాటు గుజరాత్ లోని ద్వారక, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో జరిగింది. ఇదిలా ఉంటే ఈ నెల 21 కులూమనాలి లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడం కోసం నిఖిల్ తో పాటు ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్ళారు. అయితే… అక్కడ ఈ చిత్ర బృందం మంచు తుఫాన్ లో చిక్కుకుంది. షూటింగ్ చేయలేని పరిస్థితి నెలకొంది. నాలుగు రోజుల పాటు షూటింగ్ చేసుకుని తిరిగి రావాల్సి ఉండగా, మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోందని చిత్ర సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో షూటింగ్ జరుపుకునే విధంగా రోడ్లు క్లియర్ అయ్యేలా ఉందని, ఆ తర్వాత యూనిట్ హైదరాబాద్ రాగానే ఇక్కడ ఓ పది రోజులు షూటింగ్ షెడ్యూల్ జరుపుతామని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ, హీరో నిఖిల్ ఓ వీడియోను పంపారు. అయితే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Related posts