telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆ వార్తలు చూసి నవ్వుకున్నా: కిషన్ రెడ్డి

kishan reddy mp

తెలంగాణలో బీజేపీనేత కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. నరేంద్ర మోదీ క్యాబినెట్ లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పదవిని చేపట్టారు. ఢిల్లీలో ఈ రోజు ఓ మీడియా చానల్ ప్రతినిధితో కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు బదులిచ్చారు.పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్దిసేపటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతిలో చీవాట్లు తిన్నట్టు వచ్చిన వార్తలపై కూడా వివరణ ఇచ్చారు.

ఎవరు పుట్టించారో కానీ, ఆ వార్తలు చూసి నవ్వుకున్నానని అన్నారు.అమిత్ షా తనను మందలించారనడంలో నిజంలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. టెర్రరిజానికి హైదరాబాద్ మూలకేంద్రంగా మారిందని తాను వ్యాఖ్యానించానని, అయితే, ఉగ్రవాదం విషయంలో ఇంకా గట్టిగా మాట్లాడాలని అమిత్ షా చెబుతారే తప్ప, ఎప్పుడూ డిసప్పాయింట్ చేసేలా మాట్లాడరని తెలిపారు.

Related posts