ఏపీలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లావాసులు ఇప్పుడు కరోనా భయంతో వణికిపోతున్నారు. జిల్లాలో తాజాగా మరో 33 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 663కు పెరిగింది. ఇప్పటి వరకు 11 మంది కరోనా వైరస్ తో మృత్యువాతపడ్డారు.
అత్యధికంగా ఒంగోలులో 14, మార్కాపురంలో 12 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 80,641 మంది నుంచి నమూనాలు సేకరించగా, 76,153 మంది ఫలితాలు నెగటివ్గా వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. 3,867 మంది ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లాలో 525 మంది క్వారంటైన్లో ఉండగా, 262 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 401 కేసులు యాక్టివ్గా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
కల్వకుంట్ల జగన్ మోదీ రెడ్డి: లోకేష్