telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

మదనపల్లి జంట హత్య కేసులో మరో ట్విస్ట్‌ !

మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం సభ్యులు… ఒకరకమైన మూఢత్వంలోకి వెళ్లిపోయారు. ఉన్మాదభక్తితో కన్నప్రేమను మర్చిపోయారా తల్లిదండ్రులు. కడుపున పుట్టిన పిల్లల్ని… కర్కషంగా చంపేశారు.  అయితే… మొన్నటి వరకు పిచ్చిగా ప్రవర్తించిన పురుషోత్తం నాయుడు, పద్మజ.. తాజాగా కోలుకున్నారు. ఈ ఇద్దరు నిందితులకు విశాఖ మానసిక హాస్పిటల్ వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించింది. అయితే.. ఈ రోజు సాయంత్రం వైద్యుల పర్యవేక్షణలో పురుషోత్తం నాయుడు, పద్మజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు కీలక విషయాలు తెలిపారు. కన్న కూతుళ్ల హత్య కేసులో ఆ తల్లిదండ్రులు పశ్చాత్తాపం పడుతున్నట్లు తెలిపారు వైద్యులు. విశాఖ మానసిక ఆసుపత్రి నుండి రేపు డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు పేర్కొన్నారు. పురుషోత్తం నాయుడు, పద్మజ లను మదనపల్లి సబ్ జైలు సిబ్బందికి అప్పగిస్తామని వైద్యులు తెలిపారు.

Related posts