ఎటుచూసినా పెరిగిపోతున్న అస్లీలత, దీనితో విచక్షణ కోల్పోతున్న మనసులు. అదే మనిషిని పశువుగా చేస్తుంది. దీనితో అత్యాచారాలు వయోభేదం లేకుండా చోటుచేసుకుంటున్నాయి. అంతటితో ఆగటంలేదు, బంధుత్వాలు కూడా ఈ విషయంలో అతీతం అవుతుండటం విచారకరం.
తాజాగా, మానవత్వానికే మచ్చ తెచ్చే మరో ఘటన నెలకొంది. నంద్యాల మండలం పెద్దకొట్టాలలో ఓ తల్లిపై కొడుకు అత్యాచారయత్నం చేశాడు. దీనితో ఆగ్రహించి కర్రతో కొడుకుని చితకబాదింది ఆ తల్లి అంజనమ్మ. తీవ్ర గాయాలైన కొడుకుని 108 సహాయంతో తానే ఆసుపత్రికి తరలించింది. అయితే.. చికిత్స పొందుతూ కొడుకు శ్రీనివాసులు (35) మృతి చెందాడు. వార్త తెలిసిన అంజమ్మ వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది.