telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

కన్న తల్లిపై అత్యాచార ప్రయత్నం…చితక్కొట్టి చంపి, లొంగిపోయిన తల్లి..

SIT Investigation YS viveka Murder

ఎటుచూసినా పెరిగిపోతున్న అస్లీలత, దీనితో విచక్షణ కోల్పోతున్న మనసులు. అదే మనిషిని పశువుగా చేస్తుంది. దీనితో అత్యాచారాలు వయోభేదం లేకుండా చోటుచేసుకుంటున్నాయి. అంతటితో ఆగటంలేదు, బంధుత్వాలు కూడా ఈ విషయంలో అతీతం అవుతుండటం విచారకరం.

తాజాగా, మానవత్వానికే మచ్చ తెచ్చే మరో ఘటన నెలకొంది. నంద్యాల మండలం పెద్దకొట్టాలలో ఓ తల్లిపై కొడుకు అత్యాచారయత్నం చేశాడు. దీనితో ఆగ్రహించి కర్రతో కొడుకుని చితకబాదింది ఆ తల్లి అంజనమ్మ. తీవ్ర గాయాలైన కొడుకుని 108 సహాయంతో తానే ఆసుపత్రికి తరలించింది. అయితే.. చికిత్స పొందుతూ కొడుకు శ్రీనివాసులు (35) మృతి చెందాడు. వార్త తెలిసిన అంజమ్మ వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది.

Related posts