telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏకంగా 14 మందితో భార్య ఎఫైర్… రూ.100కోట్లకు పరువు నష్టం దావా వేసిన భర్త

Sex

రాను రాను మానవ సంబంధాలు మరీ మంట గలుస్తున్నాయి. ఓ మహిళ 14 మందితో సంబంధాలు నెరిపి నీచానికి ఒడికట్టింది. భార్య తీరుపై అనుమానం రావడంతో భర్త నిఘా పెట్టగా ఏకంగా 14మందితో ఎఫైర్లు పెట్టుకున్నట్లు తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన పరువు పోవడానికి కారణమైన ఆ 14 మందికి నోటీసులు పంపాడు. పశ్చిమ బెంగాల్‌లో తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కోల్ కత్తాకు చెందిన ఓ వ్యాపారి ఇటీవల పెళ్ళి చేసుకున్నాడు. ఎప్పుడు భార్య సెల్ ఫోన్ కే పరిమితమవడం, బయట తిరుగుతుండటంతో అతడికి భార్య మీద అనుమానం వచ్చింది. తనతో కాకుండా మరికొందరితో ఆమెకు లైంగిక సంబంధం కలిగి ఉందని డౌట్ వచ్చింది. దీంతో ఆమె మీద తన డ్రైవర్ తో నిఘా పెట్టాడు. ఆ డ్రైవర్ కొన్ని రోజుల పాటు ఆమెని ఫాలో అయి నిజాలు వెలికి తీశాడు. యజమాని భార్య ఏకంగా 14 మందితో వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు గుర్తించి విషయం తెలియజేసాడు. ఇది విని ఆ వ్యాపారి తీవ్ర మనస్తాపం చెందాడు. అంత ప్రేమగా చూసుకున్నా..భార్య ఇంత మోసగించడాన్ని భరించలేక పోయాడు.
తన భార్యతో లైంగిక సంబంధం ఏర్పరచుకున్న 14 మంది బాయ్ ఫ్రెండ్స్ కి అతడు నోటీసులు పంపాడు.’ మీరు చేసిన పని వల్ల నా పరువు పోయింది.. నా పరువుకు భంగం వాటిల్లినందుకు ఒక్కొక్కరు రూ.100 కోట్లు పరువునష్టం చెల్లించాలి’ అంటూ అందరికీ నోటీసులు పంపించాడు. అందుకు వారికి కేవలం 2 వారాల గడువు ఇచ్చాడు. ఆ లోపు డబ్బు చెల్లించకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.

Related posts