తెలంగాణలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పీఎస్ పరిధిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. తెలుగు సీరియల్ నటి లహరి తన కారుతో బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
మంగళవారం రాత్రి షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్న లహరి.. ఓ బైకర్ ను ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత కారు చుట్టూ గుమిగూడిన జనాల్ని చూసి భయపడిన లహరి చాలా సేపటి వరకు కారులోంచి బయటకు దిగలేదు. దీంతో వాహనదారులకు ఆమెపై మండిపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాధితుడిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. దాంతో పోలీసులు, ఆమెను కారులోనే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. లహరి మద్యం సేవించిందేమోనన్న అనుమానంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. అయితే ఆమె మద్యం సేవించలేదని తేలింది.
మరోవైపు గాయపడ్డ వ్యక్తి తరఫున ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో… లహరిని బుధవారం ఉదయం స్టేషన్కు రావాలని సంతకం తీసుకుని ఇంటికి పంపించేశారు.