యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్.. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీత సినిమాలో నటిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగానే రీసెంట్ గా ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఈ రెండు చిత్రాలే కాక వీర డైరెక్టర్ రమేష్ వర్మ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు.
కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన థ్రిల్లర్ మూవీ రాక్షసన్ తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇక ఈ చిత్రంలో సాయి కి జోడిగా రకుల్ ప్రీతీ సింగ్ ను గాని రాశిఖన్నా ను గాని ఎంపిక చేయాలనీ చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సాయి నటించిన సినిమాల్లో టాప్ హీరోయిన్లనే ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాగే ప్లాన్ చేసాడు.
ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ లో విష్ణు విశాల్, అమలా పాల్ జంటగా నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
జైకి ఇంకా పెళ్ళి కాలేదు… తమిళ అబ్బాయినే పెళ్ళి చేసుకుంటా… : అంజలి