telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

వైసీపీలోకి … దాసరి జై రామ్ రమేష్.. నేటి సాయంత్రం మూహూర్తం.. !

voilance jummalamadugu ycp tdp
ఏపీ రాజకీయాలలో వలసల పర్వం కొనసాగుతోంది. టీడీపీకి చెందిన మరో నేత పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేత దాసరి జై రమేశ్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనను విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దింపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌తో జై రమేష్ భేటీ అయ్యే అవకాశం ఉంది. 
జై రమేష్ కొంతకాలంగా టీడీపీ దూరంగా ఉంటూ వస్తున్నారు. విజయ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ అయిన జై రమేష్… ఎన్టీరామారావు కుటుంబానికి సన్నిహితుడు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రమేష్ కీలకంగా వ్యవహరించారు.  

Related posts