జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉగ్రదాడినిఆయన తీవ్రంగా ఖండించారు. అమర జవాన్ల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రదాడితో దేశమంతా విషాదంలో మునిగిపోయిందనన్నారు.
తాను కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈనెల 17న తను పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపుకోరాదని కేసీఆర్ నిర్ణయించారు. తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించవద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఈ తరుణంలో తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించవద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.