telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వారణాసి చేరుకున్నతెలంగాణ రైతులు

Telangana farmers nomination varanasi

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పసుపు రైతుల బృందం వారణాసి చేరుకుంది. పసుపు రైతుల రాష్ట్ర జిల్లా అద్యక్షులు నర్సింహ నాయుడు, తిరుపతి రెడ్డిల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు వెళ్లి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. వీరికి మద్దతుగా తమిళనాడుకు చెందిన ఈరోడ్‌ ప్రాంత పసుపు రైతులు తరలివచ్చారు. ఆర్మూర్‌, ఇందూర్ ప్రాంతాల పసుపు రైతులు 29న సోమవారం నాడు వారణాసి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

తెలంగాణలో మొదటి విడతలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ రైతులు భారీ సంఖ్యలో తమ నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 50 మంది రైతులు రైతులు నామినేషన్లు సమర్పించడం ద్వారా పసుపు బోర్డు సమస్యను మోదీ దృష్టికి తీసుకురానున్నారు.

Related posts