telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఓడిపోతానని తెలిసే చంద్రబాబు రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారు: శ్రీకాంత్ రెడ్డి

srikanthreddy ycp

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే చంద్రబాబు రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారని ప్రభుత్వ చీఫ్ విప్, వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండున్నర లక్షల కోట్ల అప్పులను రాష్ట్రంపై మోపిన చంద్రబాబు, ఏకంగా రూ.లక్ష కోట్ల బిల్లులను పెండింగ్ లో పెట్టి వెళ్లారని ఆరోపించారు. గతంలో ప్రతిపక్షాన్ని విమర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు చేసిన అవినీతిపై ఎందుకు ట్వీట్లు చేయడం లేదని నిలదీశారు.

పబ్లిసిటీకి దూరంగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారనితెలిపారు. కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాలని కలెక్టర్లను ఆదేశించారని గుర్తుచేశారు. ఇది చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు శ్రీనివాసుల రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తమకు తెలియదని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో లోతుగా విచారణ సాగుతోందనీ, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పారు.

Related posts